సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు బలంగా మొదలయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కీలక సూచీలు సోమవారం ఉత్సాహంగా ట్రేడింగ్ను ఆరంభించాయి. సెన్సెక్స్ 300పాయింట్ల లాభంతో 35,995 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు ఎగిసి 10, 818వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. రియల్టీ, బ్యాంకింగ్ , ఐటీ, ఆటో ఇలా అన్నీ పాజిటివ్గానే.
టాటా మోటార్స్, ఇండస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టైటన్ మారుతి, భారతి ఇన్ఫ్రాటెల్ టాప్ విన్నర్స్గా ఉండగా, డా.రెడ్డీస్, ఇండియా బుల్స్, జీ ఎంటర్టైన్మెంట; కోటక్ మహీంద్ర బ్యాంకు, బజాజ్ ఆటో, నెస్లే , బంధన బ్యాంకు నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి.
అటు కరెన్సీ మార్కెట్లో దేశీయ కరెన్సీ రూపాయి స్థిరంగా ప్రారంభమైంది. 30 పైసలు ఎగిసి 69. 42 వద్ద మొదలైంది. శుక్రవారం 69.72 వద్ద ముగిసింది.